జయశంకర్ భూపాలపల్లి : టీఆర్ఎస్ పాలనలో భూపాలపల్లి మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధి జరిగిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు.
భూపాలపల్లి మున్సిపాలిటీ 25వ వార్డు కౌన్సిలర్, సీపీఐ నాయకుడు సజ్జనపు స్వామి తన అనుచరులతో కలిసి సోమవారం స్థానికంగా ఎమ్మెలే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి.. సజ్జనపు స్వామికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సమగ్రాభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని అన్నారు.
మరో రెండు నెలల్లో 57 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ ఇస్తుందని తెలిపారు.
ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి