హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుకాస్.. ఉగాది ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రతి కొనుగోలుపై ఉచిత గిఫ్ట్ వోచర్ను అందిస్తున్నది. ఈ నెల 14 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ కింద రూ.50 వేల విలువైన పసిడి, వెండి ఆభరణాలు కొనుగోలు చేసినవారికి రూ.1,000 విలువైన గిఫ్ట్ వోచర్, రూ.50 వేల విలువైన డైమండ్లు, ఆభరణాలను కొనుగోలు చేసినవారికి రూ.5 వేల గిఫ్ట్ వోచర్ను అందిస్తున్నది. ఏడాది ఉచిత బీమా, బైబ్యాక్ గ్యారెంటీ సదుపాయం కూడా కల్పించింది.