ఫ్రెండ్ షిప్ యాప్లో పరిచయమై, ఆ తరువాత నగర యువతిని బ్లాక్మెయిలింగ్ చేస్తున్న కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ యువతికి టన్టన్ యాప్లో బెంగళూర్కు చెందిన ప్రశాంత్కుమార్ పరిచయమయ్యాడు. ఇద్దరు కొన్నాళ్లు స్నేహంగా చాటింగ్ చేశారు. ఆ తరువాత నీవు బెంగళూరుకు వచ్చి శారీరకంగా కలువాల్సిందేనంటూ బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. లేకుంటే నీ ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ బెదిరింస్తుండటంతో బాధితురాలు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమో దు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి, నిందితుడు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ సమీపంలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. బుధవారం కోర్టులో హాజరుపరిచారు.