నారాయణపేట టౌన్, ఏప్రిల్ 6 : కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లు, పోలీసు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధ్యక్షతన మంగళవారం సమీక్ష సమావేశం జరిగిందని వారికి తెలిపారు. జిల్లా పరిధిలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించే విధంగా, భౌతిక దూరం పాటించే విధంగా చూడాలన్నారు. ఎవరై నా ఉల్లంఘించినా వారికి జరిమానాలు విధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా శానిటైజర్ వినియోగించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఊరు పేరు తెలియని వాడు చెప్తే నేనెందుకు వింటా: నాగార్జున