బిజినెస్లో పార్టనర్షిప్ ఇస్తానంటూ.. ఓ వితంతువుకు రూ.3 లక్షలు టోకరా..
బెంగళూరుకు చెందిన వ్యక్తి అరెస్ట్
సిటీబ్యూరో, మార్చి 19(నమస్తే తెలంగాణ): వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికి.. డేటింగ్ సైట్లో పరిచయమైన ఓ వితంతువు ను బోల్తా కొట్టించి.. రూ.3 లక్షలు కాజేసిన బెంగళూరుకు చెందిన వ్యక్తిని శుక్రవారం రాచకొండ సైబర్ క్రైం పో లీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన కుమార్ రాజువన్ష్ ఇండియన్ మేనేజ్మెంట్ స్టడీస్ పూర్తి చేశాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్, క్రషర్, టీ కప్ల తయారీ వంటి వ్యాపారాలను నిర్వహించాడు. వాటిలో నష్టాలు వచ్చాయి. వాటి నుంచి బయట పడేందుకు.. ఆన్లైన్ చీటింగ్ చేయాలనుకున్నాడు.. ఇందులో భాగంగా డేటింగ్ సైట్ లో తన నంబర్ను నమోదు చేసుకుని.. కొంత మంది మహిళలతో తాను పెద్ద బిజినెస్మెన్ అని.. విడాకులు తీసుకుని ఇప్పు డు ఒంటరిగా ఉంటున్నానని చెప్పాడు.
ఇలా క్వాక్క్వాక్ సైట్లో పరిచయం అయిన రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధికి చెం దిన ఓ వితంతువుతో ఇలానే నమ్మించాడు. నా బిజినెస్లో పార్టనర్షిప్తో పాటు ఆమె కొడుకుకు ఉద్యోగం ఇస్తానని నమ్మించా డు. ఈ క్రమంలో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు దాదాపు రూ.3 లక్షలను ఆమె నుంచి వసూలు చేశాడు. అప్పటి నుంచి ఆ వితంతువు ఫోన్కు స్పందించడం లేదు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్ కైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా లభించిన ఆధారాలతో శుక్రవారం కుమార్ రాజువన్షన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.