న్యూఢిల్లీ : బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి దిలీప్ గాంధీ (70) మృతికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు. ‘దిలీప్ గాంధీ మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. మధ్యప్రదేశ్లోని అహ్మాద్నగర్ నుంచి ఆయన మూడుసార్లు పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించారు. జనాధరణ కలిగిన నాయకుడిగా నిరంతరం తన పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి దిలీప్ గాంధీ కృషి చేశారు. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. కరోనా బారినపడిన దిలీప్ గాంధీ (70) ఢిల్లీలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. అహ్మద్నగర్ దక్షిణ లోక్సభ స్థానం నుంచి మూడుసార్లు ఆయన ఎంపీగా గెలుపొందారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ హయాంలో నౌకాయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.