నల్లగొండ : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపునకు బండిలింగ్ కార్యక్రమం పూర్తి అయింది. సాయంత్రం 6 గంటల నుంచి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. సాయంత్రం 7.30 గంటలకు తొలి రౌండ్ ఫలితాల రావచ్చని అంచనా. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొత్తం ఏడు రౌండల్లో పూర్తి కానుంది. అనంతరమే చెల్లని ఓట్ల సంఖ్యపై నిర్ధారణ, గెలుపు కోటాపై స్పష్టత రానుంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానానికి మొత్తం 3,86,320 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్ల లెక్కింపునకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం తర్వాతే విజయానికి ఏ అభ్యర్థి చేరువలో ఉన్నారనేది తెలుస్తుందని అధికారులు అంటున్నారు.