కమాన్పూర్, మార్చి 16: రొంపికుంటలో ముగ్గురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను టీఆర్ఎస్ నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సిఫారసు మేరకు ఆర్ రాజేశ్వరికి రూ.31,500, జే రజితకు రూ.10 వేలు, టీ రాజయ్యకు రూ.8,500 చొప్పున సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరుకాగా, అందజేశారు. కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఇంతియాజ్, వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, నాయకులు కొయ్యడ రవి, కొయ్యడ కుమార్, పెండ్లి సతీశ్, చిందం తిరుపతి, బాద్రపు మల్లేశ్, పొనగంటి కనకయ్య, పెండ్లి నారాయణ, రాచకొండ రవి తదితరులున్నారు