హైదరాబాద్ , మార్చి 10 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామచంద్రు తేజావత్ కూకట్పల్లిలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ప్రకృతి సైనికుడిగా ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమంలో ప్రతి పౌరుడు పాల్గొని పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్ బృందాన్ని అభినందించారు.