మంత్రులకు మద్దతు లేఖలు అందజేసిన 17 సంఘాలు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపిస్తామని భరోసా
న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ: పనిచేసే ప్రభుత్వానికి ఉద్యోగులు మద్దతు ప్రకటిస్తున్నారు. బుధవారం వివిధ సంఘాలు సమావేశమై సభ్యులు తీర్మానించిన మద్దతు లేఖలను మంత్రులు, టీఆర్ఎస్ నేతలకు అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎస్ వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డి తొలి ప్రాధాన్య ఓటు వేస్తామని భరోసా ఇచ్చారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ ఉద్యోగుల సంఘం కేంద్ర కమిటీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. వాణీదేవి, పల్లాకు మద్దతు ప్రకటించి ఆ లేఖను ఆ సంఘం ప్రతినిధులు మంత్రి గంగుల కమలాకర్కు అందజేశారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన టీఆర్ఎస్ అభ్యర్థులకు టీఎంయూ నేత థామస్రెడ్డి మద్దతు ప్రకటించారు. మింట్ కాంపౌండ్లోని కార్యాలయం లో విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని తీర్మానించింది. ఎస్ వాణీదేవికి మద్దతుగా బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో ఆనంద్బాగ్లోని శ్రీ గజానన ఫంక్షన్హాలులో బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వాణీదేవి మద్దతు లేఖను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు అందజేశారు. ఇంజినీర్స్ అసోసియేషన్ నేతలు మంత్రి నిరంజన్రెడ్డిని కలిసి టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్గౌడ్ నేతృత్వంలోని ఉద్యోగులు ఆర్థికశాఖ మంత్రి హరీశ్ను కలిసి మద్దతు ప్రకటించారు. ప్రగతిని ఉద్యమంగా కొనసాగిస్తున్న పార్టీ అభ్యర్థులకే మద్దతునిస్తున్నట్టు టీటీయూ ప్రకటించింది. ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల సంఘం, తెలంగాణ హ్యుమన్ రైట్స్ కం మీడియా ఆర్గనైజేషన్, హైకోర్టు న్యాయవాదుల సంఘం నేతలు వేర్వేరుగా మంత్రి హరీశ్రావును కలిసి మద్దతు ప్రకటించారు. మంత్రి హరీశ్రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బొర్లకుంట వెంకటేశ్, ఎమ్మెల్యే కాలే యాదయ్యను సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ప్రతినిధులు కలిసి మద్దతు ప్రకటించారు. ఎయిడెడ్ స్కూల్స్ టీచర్స్ గిల్డ్, తెలంగాణ గెజిటెడ్ పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్, పీఆర్టీయూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు తెలిపింది. తెలంగాణ ప్రొగ్రెస్సివ్ టీచర్స్ యూనియన్ (టీపీటీయూ) కార్యవర్గ సమావేశ మద్దతు తీర్మానాన్ని నేతలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అందజేశారు. సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లి ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, పటాకులు కాల్చి సంబురాలు జరిపారు.
తెలంగాణ ఉద్యోగుల సంఘం కేంద్ర కమిటీ, రాష్ట్ర వయోజన విద్య ఉద్యోగుల సంఘం, తెలంగాణ మజ్దూర్ యూనియన్, తెలంగాణ విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్, బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య, ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ టీచర్స్ యూనియన్, తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల సంఘం, తెలంగాణ హ్యుమన్ రైట్స్ కం మీడియా ఆర్గనైజేషన్, హైకోర్టు న్యాయవాదుల సంఘం, సీపీఎస్ ఉపాధ్యాయ సంఘం, ఎయిడెడ్ స్కూల్స్ టీచర్స్ గిల్డ్, తెలంగాణ గెజిటెడ్ పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రొగ్రెస్సివ్ టీచర్స్ యూనియన్, ఇంటర్ విద్యా జేఏసీ, పీఆర్టీయూ.