డోర్నకల్, మార్చి 8: ఓ తల్లి కన్నపేగును వదిలించుకున్నది. అప్పుడే పుట్టిన పసికందును చెట్ల పొదల్లో వదిలేసింది. ఈ అమానవీయ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూర్గుపాడులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే చోటుచేసుకున్నది. బూర్గుపాడు ఎస్సీ కాలనీ సమీపంలో సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు పసికందును చెట్ల పొదల్లో వదిలివెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికురాలు వెంకటలక్ష్మి సమాచారం మేరకు అధికారులు వచ్చిన దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పాప ఆరోగ్య విషయమై మంత్రి సత్యవతిరాథోడ్ అధికారులను ఆరా తీశారు.