న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ డాక్టర్ నరేంద్ర జాదవ్ ఇవాళ పార్లమెంట్కు ప్రత్యేక మాస్క్లో వచ్చారు. హై ఎఫీషియన్సీ పార్టికులేట్ ఎయిర్(హెచ్ఈపీఏ) మాస్క్ ధరించిన ఆయన సభకార్యక్రమాలకు హాజరయ్యారు. ఎంపీ నరేంద్ర ధరించిన మాస్క్ సామర్థ్యం 99.7 శాతంగా ఉన్నట్లు తేలింది. ఈ మాస్క్ నుంచి శరీరంలోకి చాలా స్వల్ప స్థాయిలో పార్టికిల్స్ వెళ్తాయని ఎంపీ నరేంద్ర తెలిపారు. అయితే ఆ మాస్క్ను తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి డిజైన్ చేసినట్లు ఆయన వెల్లడించారు.