న్యూఢిల్లీ: భారత్లో భవిష్యత్ పెట్టుబడులు పెట్టేందుకు మైక్రో బ్లాగింగ్ సైట్ సీఈవో జాక్ డోర్సీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల నిరవధిక ఆందోళన విషయమై భావ ప్రకటనా స్వేచ్ఛపై సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్, కేంద్రం మధ్య వాడీవేడీ యుద్ధం సాగుతున్న వేళ.. భారతదేశంలో క్రిప్టో కరెన్సీ.. బిట్ కాయిన్ అభివృద్ధి చేయడానికి అవసరమైన ఎండోమెంట్ ఫండ్ ఏర్పాటు చేయడానికి జాక్ డోర్సీ ప్రణాళికలు రూపొందిస్తుండటం ఆసక్తికర పరిణామం.
డిజిటల్ కరెన్సీలన్నీ చట్ట విరుద్ధమని ప్రకటిస్తూ కేంద్రం త్వరలో చట్టం తేవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో అమెరికన్ రాప్డ్ జే-జడ్తో కలిసి జాక్ డోర్సీ ఈ ఎండోమెంట్ ఫండ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భారత్తోపాటు ఆఫ్రికా ఖండంలో 500 బిట్ కాయిన్ల అభివ్రుద్ధికి ఈ ఫండ్ ఉపకరిస్తుంది. ఈ ఇన్షియేటివ్ను ముందుకు తీసుకెళ్లేందుకు ముగ్గురు బోర్డు డైరెక్టర్లను నియమించడానికి తహతహలాడుతున్నారు. ముగ్గురు బోర్డు డైరెక్టర్ల నియామకానికి అప్లికేషన్లను ఆహ్వానిస్తున్న డాక్యుమెంట్ను కూడా డోర్సీ శుక్రవారం అటాచ్ చేశారు.