అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ జోడీగా యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే నటించింది. జూన్ 19న చిత్ర విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా, ఈ క్రమంంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు.
ప్రేమికుల రోజు కానుకగా మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ట్యూన్ చేసిన రొమాంటిక్ సాంగ్ ‘గుచ్చే గులాబీలాగా పాటను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్, శ్రీమణి లిరిక్స్ అందించగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు. ఈ పాట సంగీత ప్రియులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. మీరు పాట విని ఎంజాయ్ చేయండి.