ఆత్మకూరు, జూలై 19: మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వానలకు నారాయణపూర్, ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తారు. ఎగువ నుంచి ఉధృతంగా వస్తున్న వరద నీటితో జూరాల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్నది. సోమవారం ఉదయం 85,856క్యూసెకుల ఇన్ఫ్లో రాగా 9గంటల వరకు 1,08,000క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్రం వరకు లక్ష క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగగా 6గంటల వరకు 1,23,000 క్యూసెక్కులు కొనసాగింది. ఇన్ఫ్లో లక్ష క్యూసెక్కులకు చేరుకోగానే ఉదయం నుంచి ఒక్కొక్కటిగా గేట్లు ఎత్తారు. సాయంత్రం 9గంటల వరకు 20గేట్లు ఎత్తి 1,18,003క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. విద్యుదుత్పత్తికి 30,517 క్యూసెక్కులు వినియోగించారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఎడమ కాల్వకు 730, కుడి కాల్వకు 362, సమాంతర కాల్వకు 150క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.357టీఎంసీలు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు నుంచి 1,50,581 క్యూసెక్కులు దిగువకు శ్రీశైలం వైపు ప్రవహిస్తున్నది. 30,517 క్యూసెక్కులు విద్యుదుత్పత్తికి విడుదల చేస్తున్నారు. సోమవారం ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో 3.84 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయగా ఇప్పటివరకు 38.70 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. దిగువ జూరాలలో 3.7 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరుగగా మొత్తంగా 43.66 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.
తుంగభద్ర డ్యాంకు..
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయంలోకి వరద నీరు చేరుతున్నది. ఎగువన ఉన్న శివమొగ్గ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. దీంతో టీబీడ్యాంలోకి వరద వస్తోంది. సోమవారం డ్యాంకు 41,475 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 877 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుతం 1616.99 అడుగులు నమోదైంది. 100.855 టీఎంసీల నీటిమట్టానికి ప్రస్తుతం 50.459 టీఎంసీల నిల్వ ఉన్నట్లు డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి 445 క్యూసెక్కులు చేరుతుండగా కన్స్ట్రక్షన్ స్లూయిస్, స్కవర్ స్లూయిస్ గేట్ల ద్వారా దిగువన సుంకేసుల బ్యారేజీకి 930క్యూసెక్కులు చేరుతున్నట్లు కర్ణాటక జేఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో నీటినిల్వ 4.5 అడుగులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
కోయిల్సాగర్ నీటినిల్వ 24.3 అడుగులు
దేవరకద్రరూరల్, జూలై 19: మండలంలోని కోయిల్సాగర్ ప్రాజెక్టులో సోమవారం సాయంత్రానికి నీటినిల్వ 24.3అడుగులకు చేరుకున్నట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 32.6అడుగులు (2.3 టీఎంసీలు). జూరాల ప్రాజెక్టు బ్యాక్వాటర్ను మోటార్ల సహాయంతో 250క్యూసెక్కుల నీటిని కోయిల్సాగర్కు తరలిస్తున్నట్లు తెలిపారు. నారాయణపేట, కోడంగల్, మద్దూర్ మండలాలకు 10 క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాలకు తరలిస్తున్నారు.
శంకరసముద్రం ఒక గేటు ఎత్తివేత
కొత్తకోట, జూలై 19: శంకరసముద్రం రిజర్వాయర్కు వరద పోటెత్తడంతో సోమవారం ఒక గేటు ఎత్తినట్లు శంకరసముద్రం జేఈ అఖిల్ తెలిపారు. ఆదివారం రెండు గేట్లు ఎత్తగా రిజర్వాయర్కు వరద ఉధృతి తగ్గడంతో ఒక గేటు ద్వారా 750క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు ఆయన తెలిపారు.
శ్రీశైలానికి భారీగా తరలొస్తున్న వరద
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో రిజర్వాయర్ జలకళను సంతరించుకుంటున్నది. జూరాల గేట్ల ద్వారా 1,18,003 కూసెక్కులు విడుదల కాగా విద్యుదుత్పత్తి ద్వారా 30,517 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 183క్యూసెక్కులు మొత్తం 1,48,703 క్యూసెక్కులు వస్తున్నది. సోమవారం సాయంత్రానికి ఇన్ఫ్లో 1,00,571 క్యూసెక్కుల వస్తున్నదని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా ప్రస్తుతం 829.60 అడుగులకు చేరగా, నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 49.0731 టీఎంసీలు ఉన్నది. అవుట్ఫ్లో 26,839 క్యూసెక్కులు విడుదలవుతున్న.