భూత్పూర్, ఆగస్టు 11 : దళితవాడల అభివృద్ధికి ప్రభు త్వం కృషి చేస్తున్నదని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి అ న్నారు. బుధవారం భూత్పూర్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశానికి హాజరై మాట్లాడారు. దళిత, గిరిజన వాడల్లో మౌలిక వసతుల కల్పనకు సర్వే నిర్వహించి ప్రణాళిక రూ పొందించాలని సూచించారు. ప్రధానంగా సీసీరోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు తదితర మౌలిక వసతుల ఏర్పాటుపై దృష్టి సారించాలని కోరారు. అనంతరం న్యూమోకోకల్ వ్యాక్సిన్పై ప్రోగ్రాం ఆఫీసర్ సంధ్యాకిరణ్మయి అవగాహన కల్పించారు. సమావేశంలో ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, మండల ప్రత్యేకాధికారి సాయిబాబా, ఎంపీడీవో మున్ని, తాసిల్దార్ చెన్నకిష్టన్న, కమిషనర్ నూరుల్నజీబ్, ఎంపీవో విజయకుమార్, వైస్ఎంపీపీ నరేశ్గౌడ్, మండల కోఆర్డినేటర్ ఖాజా, సీహెచ్వో రామయ్య, ఏఈలు ప్రదీప్, ప్రదీప్ ఉన్నారు.
ప్రణాళిక సిద్ధం చేయాలి
అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
మహబూబ్నగర్టౌన్, ఆగస్టు 11 : దళిత, గిరిజన వాడల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులు పూర్తిస్థాయి సర్వే చేపట్టి ప్రణాళిక సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్మన్ కేసీ నర్సింహులు అధ్యక్షతన వార్డు ప్రత్యేకాధికారులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. మున్సిపాలిటీలోని అన్ని దళిత, గిరిజన వాడల్లో పర్యటించి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ వైస్చైర్మన్ తాటి గణేశ్, కమిషనర్ ప్రదీప్కుమార్, వార్డు ప్రత్యేకాధికారులు, సిబ్బంది ఉన్నారు.
సుందరంగా తీర్చిదిద్దాలి
హన్వాడ, ఆగస్టు 11 : మండలంలోని దళిత, గిరిజన వాడలను సుందరంగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయం లో ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దళిత, గిరిజన వాడల్లో నెలకొన్న సమస్యలను గుర్తించడంతోపాటు మౌలిక వసతుల కల్పనకు నివేదికలు రూపొందించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో యాదయ్య, ఎంపీపీ బాలరాజు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఈవోపీఆర్డీ వెంకట్రెడ్డి, మిషన్ భగీరథ ఏఈ యాదయ్య, ఏవో కిరణ్కుమార్, ఏపీఎం సుదర్శన్, పశువైద్యాధికారి మౌనికారెడ్డి ఉన్నారు.
సర్వే త్వరగా పూర్తి చేయాలి
అదనపు కలెక్టర్ సీతారామారావు
జడ్చర్ల, ఆగష్టు 11 : దళిత, గిరిజన వాడల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన సర్వేను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అధికారులకు సూచించారు. బుధవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో సర్పంచులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దళిత, గిరిజన వాడల్లో కల్పించాల్సిన మౌలిక వసతులపై సర్వే నిర్వహించి ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. సమావేశంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, ఎంపీడీ వో స్వరూప, ఎంపీవో జగదీశ్, పీఆర్ ఏఈ జవహర్బాబు, ఏపీవో విజయభాస్కర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ముజమిల్ తదితరులు ఉన్నారు.
పకడ్బందీగా నిర్వహించాలి
జడ్చర్ల, ఆగస్టు 11 : జడ్చర్ల మున్సిపాలిటీలోని దళితవాడలు, ఎస్టీ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు పకడ్బందీగా సర్వే నిర్వహించాలని మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి అధికారులకు సూచించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దళితవాడలు, ఎస్టీ కాలనీల్లో మురుగుకాల్వలు, సీసీరోడ్డు, వీధిలైట్లు తదితర మౌలిక వసతులపై పూర్తిస్థాయి స ర్వే చేసి ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. స మావేశంలో కమిషనర్ సునీత, ఏఈ సాయికిరణ్ ఉన్నారు.
మౌలిక వసతుల కల్పనకు చర్యలు
నవాబ్పేట, ఆగస్టు 11 : దళిత వాడల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని మండల ప్రత్యేకాధికారి, డీసీవో సుధాకర్ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. అన్ని గ్రామాల్లోని దళితవాడల్లో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఏఈలు పర్యటించి ఎక్కడెక్కడ మౌలిక వసతులు అవసరమున్నాయో గుర్తించాలని కోరారు. ముఖ్యం గా సీసీరోడ్లు, మురుగుకాల్వలు, విద్యుత్ స్తంభాలు తదితర వాటిపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, పీఆర్ డీఈ వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీడీవో శ్రీల త, ఎంపీవో భద్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు గుర్తించాలి
రాజాపూర్, ఆగస్టు 11 : మండలంలోని దళితవాడలు, గిరిజన తండాల్లో సమస్యలను గుర్తించాలని మండల ప్రత్యేకాధికారి సారిక సూచించారు. బుధవారం మండలకేంద్రంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎన్ఆర్ఈజీఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దళితవాడలు, గిరిజన తండాల్లో విద్యుత్, మురుగుకాల్వలు, తాగునీటి వసతి కల్పనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. సమావేశంలో ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీవో వెంకట్రాములు తదితరులు ఉన్నారు.
దళితవాడల్లో పర్యటించాలి
బాలానగర్, ఆగస్టు 11 : ప్రజాప్రతినిధులు, అధికారులు దళితవాడల్లో పర్యటించి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్ కోరా రు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత, గిరిజన వాడల్లో మౌలిక వసతుల కల్పనకు సర్వే నిర్వహించాలని సూచించారు. సమావేశంలో తాసిల్దార్ రవీంద్రనాథ్, ఎంపీడీవో కృష్ణారావు, ఎంపీవో శ్రీదేవి, సర్పంచులు శంకర్, మల్లేశ్యాదవ్, తిరుపతినాయక్ తదితరులు ఉన్నారు.