గద్వాల/గద్వాల న్యూటౌన్, సెప్టెంబర్ 21 : దేశ ఆర్మీ జవాన్ల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ రం జన్ రతన్ కుమార్ అన్నా రు. 1971లో పాకిస్తాన్తో జరిగిన యు ద్ధంలో భారత్ విజయానికి గుర్తుగా హైదరాబాద్ నుంచి సైకిల్ యాత్రగా బయలుదేరి మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకున్న భారత సైనికులకు ఎస్పీ, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, డీఎస్పీ రంగస్వామి తదితరులు ఘన స్వా గతం పలికారు. వీరికి సంఘీభావంగా 200 మీటర్ల జాతీయ పతాకాన్ని పట్టుకుని జవాన్లకు మద్దతు తెలుపుతూ ర్యాలీ నిర్వహించా రు. అనంతరం జిల్లా కేంద్రంలోని వైఎస్సాఆర్ చౌరస్తాలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఉ త్సాహం నింపేందుకే సైనికులు సైకిల్ యాత్ర చేపట్టారని, ఈ యా త్ర జిల్లాకు చేరడం గర్వకారణమన్నారు. యాత్ర విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. సైనిక దళాల విజయోత్సవాలను ప్ర తి భారతీయుడు ఆస్వాదించాలని సూచించారు. అనంతరం ఎస్పీ లెఫ్టినెంట్ కల్నల్ లక్ష్మణ్సింగ్ను శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. అంతకు ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్ధులతో రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట నుంచి ర్యాలీగా సోమనాద్రి కోట వరకు కొనసాగించారు. కార్యక్రమంలో సీఐ షేక్ మహబూబ్ బాషా, ఎస్సైలు హరిప్రసాద్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిల ర్లు, ఎంఏఎల్డీ కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు, పోలీసులు ఉన్నారు.
ప్రతి ఒక్కరిలో ఉత్సాహం నింపేందుకే..
వనపర్తి, సెప్టెంబర్ 21 : ప్రతి ఒక్కరిలో ఉత్సాహం, దేశభక్తి నింపేందుకే విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ కిరణ్కుమార్ తెలిపారు. స్వర్ణ విజయ్ వర్ష విజయయాత్రలో భాగంగా మంగళవారం పట్టణ సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై మధుసూదన్ ఆ ధ్వర్యంలో కెప్టెన్ కల్నల్ లక్ష్మణ్సింగ్ బృందానికి స్వాగతం పలికా రు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం లో రూరల్ ఎస్సై షేక్ షఫీ, పోలీసులు, ఆర్మీ జవాన్లు పాల్గొన్నారు.