ఆత్మకూరు, ఆగస్టు4: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. ఐదు రోజులపాటు దాదాపు 5 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎగువ నుంచి రాగా బుధవారం సగానికి తగ్గింది. సాయంత్రం 6 గంటలకు 1,76,600 క్యూసెక్కులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 25 గేట్లెత్తి స్పిల్వే ద్వారా 1,67,675 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి కోసం 24,646 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. ఎగువ జూరాలలో 5 యూనిట్ల ద్వారా ఒక్కరోజే 2.590 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి కాగా ఈ సీజన్లో 61.551 మిలియన్ యూనిట్లు, అలాగే దిగువ జూరాలలో 5 యూనిట్లలో ఒక్కరోజే 2.398 మిలియన్ యూనిట్టు కాగా ఇప్పటి వరకు 65.850 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. మొత్తంగా 1,94,387 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా నమోదైంది. కోయిల్సాగర్కు 630 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 975, కుడి కాలువకు 672, సమాంతర కాలువకు 150క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. నెట్టెంపాడు, భీమా-1, భీమా-2కు నీటి విడుదల నిలిపివేశారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు ఉండగా 7,701 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
తుంగభద్ర డ్యాంకు వరద
అయిజ, ఆగస్టు4: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. శివమొగ్గ జిల్లాలోని గాజనూరు వద్ద ఉన్న తుంగ డ్యాం నుంచి 14,944 క్యూసెక్కులు వస్తుండగా.. బుధవారం టీబీ డ్యాంలోకి ఇన్ఫ్లో 35,772 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 39,661 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి సామర్థ్యం 100.855 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 98.316 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 1633 అడుగుల నీటి మట్టానికిగానూ 1632.34 అడుగులకు చేరినట్లు డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
కర్ణాటకలోని టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. 17,100 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా, 16,700 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి ప్రవహిస్తున్నదని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం 9.5 అడుగుల మేర నీటిమట్టం ఉండగా.. ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
884.50 అడుగులకు శ్రీశైలం డ్యాం
శ్రీశైలం డ్యాంకు వరద కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 1,67,675 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 24,646 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 24,816 క్యూసెక్కులు మొత్తం కలిపి 2,17,137 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. దీంతో బుధవారం సాయంత్రం 6 గంటల వరకు జలాశయానికి 2,16,404 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా నమోదు కాగా 4 గేట్లను 10 అడుగుల ఎత్తులో తెరిచి 1,11,384 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రానికి 30,881 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రానికి 31,784 క్యూసెక్కులు మొత్తం కలిపి 1,73,749 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఏపీ పవర్హౌస్లో 15.633 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేయగా.. టీఎస్ పవర్హౌస్లో 16.195 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయినట్లు అధికారులు తెలిపారు.