నవాబ్పేట, జూలై 27: మండల పరిధిలోని కూచూర్, కారూర్, చెన్నారెడ్డిపల్లి, చౌటపల్లి గ్రామాల్లో మంగళవారం పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అందంగా అలంకరించిన బోనాలను పోచమ్మ ఆలయాల చుట్టూ ఊరేగించారు. కోళ్లు, గొర్రెలను అమ్మవారికి బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలొచ్చారు. కార్యక్రమంలో కూచూర్ సర్పంచ్ పిట్టల లక్ష్మమ్మ, ఎంపీటీసీ విజయశ్రీ, ఉపసర్పంచ్ నర్సింహగౌడ్, నాయకులు నాగిరెడ్డి, సంజీవరెడ్డి, భోజయ్యచారి, పిట్టల రవి, శేఖర్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
మండలంలోని పార్పల్లి, కోయిలకొండలో బోనాల పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని మహిళలు పోచమ్మకు మట్టి కుండలో బోనం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచులు కృష్ణయ్య, మాణిక్యమ్మయాదయ్య, వైస్ ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, కోఆప్షన్ సభ్యులు టీవీఖాజా, వార్డు సభ్యులు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
మండలంలోని నాగారం, చిన్నరాజమూర్, కోయిల్సాగర్, అజిలాపూర్లో మంగళవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి కొత్త కుండలో నైవేద్యం తయారు చేసి సమర్పించారు. సాయంత్రం గ్రామంలోని మహిళలు తలపై బోనాలను పెట్టుకొని ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకొని అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు మణెమ్మ, జయమ్మ, లక్ష్మమ్మ, విశ్వనాథం, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.