ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఎవరికీ అంతుబట్టని నిర్ణయాలతో తన గొయ్యి తానే తవ్వుకుంటోంది. మూడు మ్యాచ్ల్లో ఓటమి తర్వాత ఒకదాంట్లో గెలిచిన ఆ టీమ్.. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో చేజేతులా ఓడింది. తుది జట్టు ఎంపికతోపాటు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఈ మ్యాచ్లోనూ ఓటమి పాలైంది. ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ లేవనెత్తాడు. అసలు బెయిర్స్టోను సూపర్ ఓవర్లో ఆడించకపోవడంపై అతడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మ్యాచ్ తర్వాత అతడు చేసిన ట్వీట్ హైదరాబాద్ టీమ్కు చురకలంటించేలా ఉంది.
బెయిర్స్టో టాయిలెట్లో ఉంటే మాత్రమే అతనికి సూపర్ ఓవర్లో ఆడే చాన్స్ ఇవ్వరు. ఈ ఓవర్లో ఆడటానికి అతడే కచ్చితంగా ఫస్ట్ చాయిస్ ప్లేయర్. ఈ మ్యాచ్లోనూ బాగా ఆడాడు. 18 బాల్స్లోనే 38 రన్స్ చేశాడు. హైదరాబాద్ బాగానే ఫైట్ చేసింది. కానీ ఇలాంటి వింత నిర్ణయాలతో చేజేతులా ఓడారు అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. సూపర్ ఓవర్లో వార్నర్, విలియమ్సన్ బ్యాటింగ్కు దిగి కేవలం 7 పరుగులు మాత్రమే చేయడంతో ఎస్ఆర్హెచ్కు ఓటమి తప్పలేదు.