యాదాద్రి, ఏప్రిల్26: టీకాతోనే కొవిడ్ వైరస్ నుంచి రక్ష ణ ఉంటుందని మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ, ఆలే రు మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్గౌడ్ అన్నారు. సోమ వారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని నాల్గో వార్డులో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని వారు ప్రారంభించి టీకాను తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ టీకాతో కొవిడ్ వైరస్ను ఎదుర్కొనే శక్తి వస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ విజయలక్ష్మీకృష్ణగౌడ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
51మందికి కొవిడ్ పాజిటివ్
మండలంలో 130 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా 51 మందికి పాజిటివ్గా తేలిందని మండల వైద్యాధికారి శ్రావణ్కుమార్ సోమవా రం తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్క్రాంతి, ఏఎన్ఎం లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
వలిగొండలో 40 మందికి కొవిడ్..
వలిగొండ, ఏప్రిల్26 : మండలంలోని వర్కట్పల్లి, వలి గొండ, వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 117 మందికి కొవిడ్ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా 40 మం దికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు డాక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. వారిని హోం క్వారంటైన్కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.
మాస్కులు ధరించాలి
ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని గొల్లగూడెం లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో సోమవారం కొవిడ్పై అవగాహ న సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్ యాదవ్, ఆశ వర్కర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ
వలిగొండ, ఏప్రిల్ 26: మండలంలోని నాతాళ్లగూడెం, నెమిలకాల్వ గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కొవిడ్ కట్టడికి సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని సోమ వారం సర్పంచ్లు నాతాళ్లగూడెం సర్పంచ్ మల్లేశం, నెమిలకాల్వ సర్పంచ్ భిక్షపతి పిచికారీ చేయించారు. ఆయా కార్యక్రమాల్లో పంచాయతీ కార్యదర్శులు కిషన్, ప్రవీణ్రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పట్టణంలోని పలు వార్డుల్లో ..
భువనగిరి టౌన్, ఏప్రిల్ 26: కొవిడ్ రెండో దశ విజృం భిస్తున్న నేపథ్యంలో పట్టణంలోని 23, 34 వార్డుల్లోని ప్రధాన వీధుల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని మున్సిపల్ అధికారులు పిచికారీ చేయించారు. అదే విధంగా మురికికాల్వలు, చెత్తకుండీల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఈ కా ర్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు దుర్గాభవాని, రేణుక, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
వదంతులు నమ్మొద్దు
రామన్నపేట, ఏప్రిల్26: వదంతులు నమ్మకుండా కొవిడ్ వ్యాక్సిన్ను తీసుకోవాలని మార్కెట్కమిటీ మాజీ వైస్ చైర్మన్ బందెల రాములు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పీపీ యూనిట్లో కొవిడ్ టీకాను ఆయన తీసుకున్నారు. పీపీ యూనిట్లో వ్యాక్సిన్కోసం 45 ఏం డ్లు దాటిన వారు అధిక సంఖ్యలో బారులుదీరారు. మం డలంలో 374 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు, 10 మందికి పాజిటివ్గా తేలినట్లు మండల వైద్యాధికారి రవికుమార్ తెలిపారు.
నారాయణపురంలో 126 మందికి టీకా
సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్ 26: మండలంలో సోమవారం 126 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు మం డల వైద్యాధికారి దీప్తి తెలిపారు. పీహెచ్సీలో 88 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 31 మందికి కరోనా పాజిటివ్గా తేలిందన్నారు.
అడ్డగూడూరులో 108 మందికి..
అడ్డగూడూరు,ఏప్రిల్ 26: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంతోపాటు కోటమర్తి , చౌళ్లరామారం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన మొబైల్ క్యాంపుల్లో 108 మందికి కొవిడ్ టీకాలు ఇచ్చినట్లు సూపర్వైజర్ శోభ తెలిపారు. అదేవిధంగా 32 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా
ఆరుగురికి పాజిటివ్గా తేలిందని ల్యాబ్ టెక్నీషియన్ నర్సింహ్మ తెలిపారు.