అమరావతి : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి హిందువా? కాదా..!? స్పష్టంగా చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆయన పేర్కొన్నారు. తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతుందని ఆరోపించారు.
ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి మాత్రం గూడూరులో చర్చి కెళ్లి బిషప్ ఆశీర్వాదం తీసుకున్నారు.
రాజ్యాంగంలోని షెడ్యూల్ కాస్ట్ 1950 ప్రకారం హిందూ, బౌద్ధ, సిక్కు మతం కాకుండా అన్యమత ధర్మాన్ని పాటించే షెడ్యూల్డ్ కులాల వారి నెవరినైనా ఎస్పీలుగా గుర్తించరు.
దీని ప్రకారం రిజర్వుడు స్థానమైన తిరుపతి స్థానం నుంచి గురుమూర్తి పోటీ చేసేందుకు అర్హత లేదు అని ఆయన అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి