ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. శిఖా పాండే, ఏక్తా బిస్త్, షఫాలీ వర్మ జట్టులోకి వచ్చారు. నీతు డేవిడ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముగ్గురు క్రికెటర్లను మూడు ఫార్మాట్లకు ఎంపిక చేసింది. ఝార్ఖండ్కు చెందిన ఇంద్రాణికి మూడు ఫార్మాట్లలోనూ చోటు దక్కింది. గాయం కారణంగా సీనియర్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ ఈ పర్యటనకు దూరమైంది. టెస్టు, వన్డేల్లో భారత జట్టుకు మిథాలీ రాజ్ కెప్టెన్గా వ్యవహరించనుంది.
ఇంగ్లాండ్ టూర్లో ఆతిథ్య జట్టుతో ఇండియా విమెన్స్ టీమ్ ఒక టెస్టు, మూడు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది. టెస్టు, వన్డే జట్లు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, పూనమ్ రౌత్, ప్రియ పునియా, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలి వర్మ, స్నేహ రాణా, తానియా భాటియా (వికెట్ కీపర్), ఇంద్రాణి రాయ్ (వికెట్ కీపర్), జులన్ గోస్వామి, శిఖా పాండే, పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిస్త్, రాధ యాదవ్
టీ20 జట్టు: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి, జెమీమా, షఫాలీ వర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా, తానియా, ఇంద్రాణి, శిఖా పాండే, పూజ, అరుంధతి, పూనమ్, ఏక్తా బిస్త్, రాధ, సిమ్రన్ దిల్ బహదూర్