తొర్రూరు, ఏప్రిల్ 20 : రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎంపీపీ తుర్పాటి చిన్న అంజయ్య, జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో కంఠాయపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో గుర్తూరు, అమ్మాపురం, హరిపిరాల, చెర్లపాలెం, చీకటాయపాలెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి సభ్యులు, ఏఈవోలు, రైతులు, ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కృషితో నియోజకవర్గంలో ని అన్ని చెరువులు నిండాయన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో ఏపీడీ డాక్టర్ సట్ల వెంకట్, వైస్ ఎంపీపీ ఇట్టె శ్యాంసుందర్రెడ్డి, సర్పంచ్ శ్రీపాల్రెడ్డి, ఎంపీటీసీ దేవమ్మ, ఏపీఎం వరదయ్య, సీసీ వెంకటయ్య, మదర్ థెరిసా మండల సమాఖ్య సభ్యులు సరిత, లలిత, స్వప్న, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
దళారులను నమ్మొద్దు
రైతులు దళారులకు ఆశ్రయిం చి ఆర్థికంగా నష్ట పోవద్దని, మద్దతు ధరను కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ చైర్మన్ కాసం లక్ష్మీచంద్రశేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని రామన్నగూడెం బస్టాండ్ వద్ద నెల్లికుదురు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. దాన్యం కొనుగోలు చేసిన రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కాసం లక్ష్మీచంద్రశేఖర్రెడ్డి, శ్రీరామగిరి సొసైటీ చైర్మన్ గుండా వెంకన్న, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ కాసం వెంకటేశ్వర్రెడ్డి, ఉప సర్పంచ్ కాసం తహసీల్దార్ అనంతుల రమేశ్, ఏవో నెలకుర్తి రవీందర్రెడ్డి, సొసైటీ సీఈవో బందారపు యాదగిరి, డైరెక్టర్లు బాలాజీ, రావుల సతీశ్, నాయకులు మురళి, పాశం రమేశ్, సైదులు, సిబ్బంది శ్రీనివాస్ పాల్గొన్నారు.
రైతులు దళారులను ఆశ్రయించొద్దు
రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు. మంగళవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండలంలోని చిన్నవంగర, చిట్యాల, వడ్డ్డేకొత్తపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు శ్రీనివాస్రెడ్డి, ప్రవీణ్రావు, లక్ష్మి, ఎంపీటీసీ సౌజన్య, రైతుబందు సమితి గ్రామ కన్వీనర్లు ఉపేందరెడ్డి, మల్లికార్జునచారి, నాయకులు శ్రీనివాస్, వెంకన్న, జనార్దన్, కుమారస్వామి, శేఖర్, అశోక్యాదవ్, వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.