మునుగోడు, ఏప్రిల్ 15 : ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కర్నాటి స్వామి, జడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి కోరారు. కల్వలపల్లి, పలివెల గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించి మాట్లాడారు. నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు వంటెపాక జగన్, గజ్జెల బాలరాజు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, ఏపీఎం శ్రీదేవి, ఎంపీటీసీ వెంకటమ్మ పాల్గొన్నారు.
నార్కట్పల్లి: మండలంలోని ఔరవాణిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం కృష్ణయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఎస్ఆర్ విజయలక్ష్మి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
దామరచర్ల : మండలంలోని పుట్టలగడ్డతండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ ఆంగోతు లలిత ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శారద, ఏపీఎం ఆయోధ్య, ఏఈఓ ప్రియాంక, ఆంగోతు హాతిరాం నాయక్ పాల్గొన్నారు.
మాల్ : గడియగౌరారం, కుర్మేడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ కంకణాల ప్రవీణ ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటయ్య, సుమతీరెడ్డి, శ్వేత, అశోక్ పాల్గొన్నారు.