శీతాకాలంలో క్యారెట్లతో చర్మ సంరక్షణ ఇలా..!

శీతాకాలంలో సహజంగానే ఎవరి చర్మం అయినా పగులుతుంటుంది. చర్మం పొడిగా మారి కొందరికి దురద కూడా వస్తుంటుంది. అయితే శీతాకాలంలో చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుకోవాలంటే అందుకు క్యారెట్ ఎంతగానో పనిచేస్తుంది. దాంతో చర్మాన్ని ఎలా సంరక్షించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ సగం ముక్క తీసుకుని దాన్ని తురుం పట్టి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ మిశ్రమంలో ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ పాలు వేసి బాగా కలిపి చర్మానికి రాయాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమగా మారుతుంది. పగలకుండా ఉంటుంది. దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చు.
ఆయిలీ స్కిన్ ఉన్నవారికి కూడా క్యారెట్లు ఎంతో మేలు చేస్తాయి. చర్మం నుంచి విడుదలయ్యే నూనెలాంటి ద్రవాన్ని క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ బయటకు పంపుతుంది. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. క్యారెట్ జ్యూస్ ఒక కప్పు తీసుకుని అందులో పెరుగు, శనగపిండి, నిమ్మరసంలను ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్గా వేసుకోవాలి. 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ఆయిలీ స్కిన్ నుంచి విముక్తి పొందవచ్చు.
క్యారెట్ జ్యూస్, పెరుగు, ఎగ్ వైట్లను సమపాళ్లలో కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాలు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చర్మం తాజాగా మారుతుంది. ముఖ సౌందర్యం పెరుగుతుంది.
క్యారెట్ జ్యూస్, రోజ్ వాటర్ను సమపాళ్లలో కలిపి స్ప్రే బాటిల్లో ఆ మిశ్రమాన్ని నింపి దాన్ని సన్ ప్రొటెక్షన్ స్ప్రే గా వాడుకోవచ్చు. దీంతో సూర్యకాంతి, దుమ్ము, ధూళిల నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది.
క్యారెట్ జ్యూస్, అలోవెరా జ్యూస్లను కలిపి ఆ మిశ్రమాన్ని రాసుకుంటే చర్మ సౌందర్యం పెరుగుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. చర్మం పగలకుండా మృదువుగా ఉంటుంది.
తాజావార్తలు
- సర్కారు పెరటి కోళ్లు.. 85 శాతం సబ్సిడీతో పిల్లలు
- కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ
- గోమాతలకు సీమంతం.. ప్రత్యేక పూజలు
- కూతురి కళ్లెదుటే.. తండ్రిని కత్తులతో పొడిచి చంపారు
- ‘పెట్రో’ ఎఫెక్ట్.. రూ.12 పెరగనున్న పాల ధర!
- రాజన్న హుండీ ఆదాయం రూ. 40.56 లక్షలు
- నయనతార పెళ్లిపై క్రేజీ గాసిప్..!
- ఆడపిల్లకు సాదర స్వాగతం.. మురిసిన కుటుంబం
- సిలిండర్ ధర ఎంత పెరిగినా.. మారని రాయితీ!
- తాగిన మత్తులో భార్యపై బ్లేడ్తో దాడి