పసుపు, అశ్వగంధ డ్రింక్ తాగితే చాలు.. ఎలాంటి వైరస్ దరిచేరదు!

కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రతిఒక్కరూ ఇమ్యునిటీ వవర్ను పెంచుకునే పనిలో ఉన్నారు. కషాయం ఒకటే కాకుండా వివిధ డ్రింక్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా హెర్బల్ టీలకు ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు. హెర్బల్ టీని చాలా రకాలుగా చేసుకుంటే. ఇందులో రకరకాల ఇంగ్రీడియంట్స్ను ఉపయోగిస్తారు. పసుపు, అశ్వగంధ వేసి కూడా టీ తయారు చేయవచ్చు. ఈ డ్రింక్ తాగితే చాలు ఇమ్యునిటీ పవర్ను పెంచడంతోపాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేని ఈ డ్రింక్కు తయారీ విధానం కూడా సింపుల్. మరి అదెలాగో చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు :
పసుపు : ఒక టీస్పూన్
అశ్వగంధ వేరు నుంచి తీసిన ఎక్ట్స్రాక్ట్
ములేథీ పౌడర్ : ఒక టీస్పూన్
నీరు : ఒక కప్పు
తయారీ :
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కప్పు నీరు తీసుకోవాలి. ఇందులో పసుపు, అశ్వగంధ ఎక్ట్స్రాక్ట్, ములేథీ పౌడర్ వేసి మూడు నిమిషాలపాటు మరిగించాలి. తర్వాత స్టవ్ కట్టేసి దించేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టి వేడి వేడిగా తాగాలి. వట్టిగా తాగలేకపోతే కొంచెం తేనె కలుపుకున్నా మంచిదే. మరీ ఎక్కువగా కాకుండా తక్కువ మోతాదులో తరచూ ఈ డ్రింక్ తాగుతుంటే ఎలాంటి రోగాలు దరిచేరవు.
తాజావార్తలు
- విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
- వ్యాక్సినేషన్పై అపోహలు వద్దు
- రూ.1,883 కోట్ల మద్యం తాగేశారు
- శివ నిస్వార్థ సేవలు అభినందనీయం
- ఆర్మీ ర్యాలీలో తెలంగాణ సత్తా చాటాలి
- పట్టణ వేదిక.. ప్రగతి కానుక
- లక్ష్యంపై గురి!
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి