లండన్ : వచ్చే ఏడాది జూలై 30 వ తేదీన బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ పెండ్లి చేసుకోనున్నారు. తన ప్రియురాలు క్యారీ సైమండ్స్ను వివాహం చేసుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా వివాహాన్ని వాయిదా వేసుకున్న వారిలో ప్రపంచంలోని ప్రజలందరిలాగే బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కూడా ఉన్నారు.
56 ఏండ్ల బోరిస్ జాన్సన్ 2019 లో 33 ఏండ్ల క్యారీ సైమండ్స్తో నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ డౌనింగ్ స్ట్రీట్లో నివసిస్తున్నారు. వీరికి విల్ఫ్రెడ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. వచ్చే ఏడాది జూలై 30 న అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పెండ్లి చేసుకోనున్నారు. భారతీయ సంతతికి చెందిన న్యాయవాది మెరీనా వీలర్, బోరిస్ జాన్సన్ గత ఏడాది విడాకులు తీసుకున్నారు. వచ్చే ఏడాది పెండ్లి వేడుక కోసం ఎదురు చూస్తున్నట్లు అతడి కుటుంబ స్నేహితులు అంటున్నారు. పెండ్లి ఎక్కడ జరుగుతుందో ఇంకా వెల్లడికాలేదు.
31 కోట్లతో డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొన్న బిగ్ బీ
ఇమ్యూనిటీ కోసం జింక్ లభించే 5 ఆహారాలు..
భారత్లో 5 జీ ట్రయల్స్కు మార్గం సుగమం
మహిళల ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్..!
రా, ఐబీ చీఫ్ పదవీకాలం పొడగింపు
‘వీర్ సావర్కర్’ సినిమాను ప్రకటించిన సందీప్, అమిత్ వాద్వానీ
నటసార్వభౌముడు పుట్టింది ఇవాళే.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..