భోపాల్ : కరోనా రోగి డెడ్బాడీ అంబులెన్స్ నుంచి ఎగిరిపడటం ఏంటని ఆశ్చర్యపోకండి. ఈ ఘటన నిజంగానే చోటు చేసుకుంది. అంబులెన్స్లో తరలిస్తున్న రోగి మృతదేహాం బయటకు ఎగిరిపడటంతో ఆ అంబులెన్స్ డ్రైవర్కు చెమటలు పట్టాయి. అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లా ఆస్పత్రిలో ఓ కరోనా రోగి చనిపోయాడు. దీంతో ఆ డెడ్బాడీని అతని బంధువులకు అప్పగించకుండా, అంబులెన్స్లో తరలిస్తున్నారు. ఆస్పత్రి గేట్లు దాటి రాగానే, అక్కడున్న మూలమలుపులో అంబులెన్స్ నుంచి కరోనా మృతదేహాం బయటకు ఎగిరిపడింది. దీంతో డ్రైవర్ అంబులెన్స్ను ఆపాడు. రోగి డెడ్బాడీ బయట పడటంతో డ్రైవర్కు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. రోగి చనిపోయాడని తమకు సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రి అధికారులు మృతదేహాన్ని తీసుకెళ్లారని మృతుడి బంధువులు ఆరోపించారు. మధ్యప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 12,384 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 75 మంది చనిపోయారు.