కేపీహెచ్బీ కాలనీ, జూన్ 20 : కరోనా టీకా వేయించుకోవడంపై అపోహలు వద్దని ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకుని ఆరోగ్యంగా జీవించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం మూసాపేట సర్కిల్లోని కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్, ఎన్కేఎన్ఆర్ గార్డెన్లలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి పకడ్బందీగా కృషి చేస్తున్నదని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు చేపట్టిన లాక్డౌ న్తో సత్ఫలితాలు సాధించినట్లు తెలిపారు. జ్వరం సర్వే తో ముందుగా కరోనా లక్షణాలను గుర్తించి మెడికల్ కిట్లను అందించడం వల్ల కరోనా కట్టడి అయిందన్నారు. మరోవైపు ఉచితంగా కరోనా పరీక్షలు చేయడంతో పాటు మందులు కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల కరోనా తగ్గుముఖం పడుతుందని త్వరలోనే కరోనా రహిత రాష్ట్రంగా మారుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రజలందరూ మరింత బాధ్యతగా వ్యవహరించాలని మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
కరోనా వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రోడ్లపై క్యూలు లేకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే కృష్ణారావు సూచించారు. వ్యాక్సినేషన్ కోసం వచ్చే మహిళలు, వృద్ధు లు రోడ్లపై నిలబడడం వల్ల ఇబ్బందులు పడుతు న్నారని వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. స్లాట్ ప్రకా రమే లోపలికి అనుమతించి వారికే ప్రాధాన్యతనిస్తూ టీ కా వేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మంద డి శ్రీనివాస్రావు, డీపీవో శ్రీనివాస్, ఎస్ఎస్ మురళీధర్ తదితరులు ఉన్నారు.
కేపీహెచ్బీ కాలనీలోని గోపాల్నగర్ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపట్టారు. కాలనీ ప్రజల ఆరోగ్యం కోసం అగర్వాల్ సమాజ్, అక్బర్ ఐ వైద్యశాల సహకారంతో 200 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేయించారు. కార్యక్రమంలో వసంత సైదుబాబు, చైతన్య, సునీల్రెడ్డి తదితరులు ఉన్నారు.