న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో మహమ్మారి లక్షణాల పట్ల ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హఠాత్తుగా నిస్సత్తువ, నీరసం, బలహీనత ఆవరిస్తే తక్షణం ఐసోలేషన్ లో ఉండాలని, వైద్యుల సూచన మేరకు కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు.
వయసుతో నిమిత్తం లేకుండా కరోనా రోగుల్లో ప్లేట్ లెట్ల సంఖ్య పడిపోవడంతో పాటు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం విపరీతమైన నిస్సత్తువకు దారితీస్తున్నాయి. కొవిడ్ రోగుల్లో శారీరకంగా ఫిట్ గా ఉండేవారిలోనూ విపరీతమైన నీరసం ఉంటోందని చెబుతున్నారు. గొంతు నొప్పి, జ్వరంతో పాటు తీవ్ర నిస్సత్తువతో బాధపడేవారు కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఐసోలేట్ కావాలని సూచిస్తున్నారు. వీరు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనలకు అనుగుణంగా ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు.