ఒకేరోజు 1.20 లక్షల బస్తాలు రాక
నేటి నుంచి 3 రోజులపాటు కొనుగోళ్లు బంద్
ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 28: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు బుధవారం ఎర్రబంగారం పోటెత్తింది. ఒక్కరోజే దాదాపు 1.20 లక్షల బస్తాల మిర్చి విక్రయానికి వచ్చింది. ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా రైతులు పంటను తీసుకొచ్చారు. మిర్చి భారీగా రావడంతో అధికారులు పత్తి యార్డులోనూ దిగుమతికి అనుమతినిచ్చారు. గరిష్ఠ ధర క్వింటాల్కు రూ.14,300 చొప్పున కొనుగోలు చేశారు. కాగా, ఈ నెల 30న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక నేపథ్యంలో 29, 30 తేదీలతోపాటు మే 1న మేడే సందర్భంగా కొనుగోళ్లు నిలిపివేయనున్నారు. మే 2 నుంచి క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు.