గౌతంనగర్, జూలై 12 : అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం మౌలాలి డివిజన్లోని ఓల్డ్ సఫిల్గూడ భజన మందిర్లో రూ.20లక్షలతో సీసీ రోడ్డు, పిల్లినర్సింగ్రావు బస్తీలో రూ. 48లక్షలు, మౌలాలి కమాన్ దగ్గర రూ.39లక్షలతో అండర్గ్రౌండ్ డైనేజీ పనులకు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కార్పొరేటర్ సునీతతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఐక్యతతో పాటుపడాలన్నారు. అదేవిధంగా భజనమందిర్లో కమ్యూనిటీహాల్ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు లేని పిల్లలను మైనంపల్లి సోషల్ సర్వీస్ ట్రస్టు ద్వారా ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్కుమార్, ఈఈ లక్ష్మణ్, డీఈ సువర్ణ, ఏఈ కౌశిక్, టీఆర్ఎస్ నాయకులు ఎం.భాగ్యందరావు, మేకల రాముయాదవ్, పిట్ల శ్రీనివాస్, ఉపేందర్రెడ్డి, ఉస్మాన్, వెంకట్రెడ్డి, ఇబ్రహీం, సత్తయ్య, లక్ష్మణ్, సంతోష్ రాందాస్, నజీమా, సంతోష్నాయుడు, ఆదినారాయణ, సంతోష్గుప్తా, శైలేందర్, దినేశ్, శ్రీనివాస్, నర్సింగ్రావు, చందు, బీజేపీ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.