ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200 మంది కాంగ్రెస్ కుటుంబాల వారు గురువారం టీఆర్ఎస్లో చేరారు. వారందిరకీ ఖమ్మంలోని తెలంగాణ భవన్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ . ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయరని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్లో గుర్తింపు లేదన్నారు.
సీఎం కేసీఆర్ పాలన నచ్చిన ప్రజలు అన్ని పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఖమ్మం నగరంలో గతంలో వారు చేసిన అభివృద్ధిని చెప్పలేకపోతున్నారని, కానీ అబద్ధాలు చెప్పడంలో ముందు వరుసలో ఉంటున్నారని విమర్శించారు. రూ.వేల కోట్లతో ఖమ్మం రూపురేఖలు మార్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
కన్నతల్లి కర్కశత్వం..కూతురు గొంతు కోసిన తల్లి
ధరణి పోర్టల్ రైతులకు వరం : మంత్రి వేముల
తెలంగాణ వచ్చాకే కవులు, కళాకారులకు గుర్తింపు
మత్తడి దుంకుతున్న ప్రకాష్ నగర్ చెక్ డ్యాం
రైతు వేదికను ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి