ఒకవైపు కరోనా సినీ పరిశ్రమని వణికిస్తుంటే మరోవైపు రోడ్డు ప్రమాదాలతో సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు మృత్యువాత పడుతున్నారు. ఇటీవల, జాతీయ అవార్డు గ్రహీత కన్నడ నటుడు సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజులకు బెంగళూరు-హైదరాబాద్ హైవే పై మంగళవారం శాండిల్ వుడ్ నటుడు జగ్గేష్ కుమారుడు గురురాజ్ వెళుతున్న కారు ప్రమాదానికి గురయింది. అయితే ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో గురురాజ్ మరణం నుండి తప్పించుకోగలిగారు.
ఇక సినీ క్రిటిక్ కత్తి మహేష్ కారు కూడా ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురి కాగా,ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఎడమ కంటి చూపు కోల్పోయినట్టు తెలుస్తుంది. ఇక తాజాగా దర్శకుడు సూర్యోదయ కుమారుడు మయూర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 20 సంవత్సరాల మయూర్ శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో బైక్పై ఇంటికి వెళ్తూ మార్గం మధ్యలో బ్యాడరహళ్లి న్యూ లింక్ రోడ్డు వద్ద వేగంగా వచ్చిన ట్యాంటర్ బైక్ను ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, సూర్యోదయ పెరంపల్లి పలు కన్నడ, తులు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు.