ఢిల్లీ,జూన్ 23: ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) కోసం రెండు కాలుష్య నియంత్రణ వెస్సెల్స్ (పీసీవీ) నిర్మాణానికి గోవా షిప్యార్డ్ లిమిటెడ్తో (జీఎస్ఎల్) రక్షణశాఖ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం పీవీసీల నిర్మాణానికి రూ.583 కోట్లు వెచ్చించనున్నారు. ఈ స్పెషల్ రోల్ షిప్స్ దేశీయంగా రూపొందించనున్నాయి. ఇవి జీఎస్ఎల్ ద్వారా నిర్మించనున్నారు. సాగరంలో చమురు స్పిప్లంగ్ వంటి విపత్తులకు స్పందించడానికి ఐసీజీ సామర్థ్యాన్ని ఇది గణనీయంగా పెంచుతుంది.
సాగర కాలుష్యపు ప్రతిస్పందన (పీఆర్) సామర్థ్యాన్ని కూడా ఇది పెంచుతుంది. ఈ రెండు వెస్సెల్స్ వరుసగా నవంబర్ 2024, మే 2025 నాటికి పూర్తికానున్నాయి. ప్రస్తుతం ఐసీజీ ముంబయి, విశాఖపట్నం, పోరుబందర్లలో మూడు పీసీవీలున్నాయి. తద్వారా కాలుష్య పర్యవేక్షణలు,చమురు లీకుల పర్యవేక్షణ కార్యకలాపాలనుభారత ఈఈజెడ్,ఐలాండ్ల చుట్టూ నిర్వహిస్తుంది. ఈ ఒప్పందం దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. దీనికి తోడు 200 మంది ఎంఎస్ఎంఈ విక్రేతలకు నౌకానిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచుతుంది.