నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో 60 మంది యువకులు కలిసి 2014లో చేయూత ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. గ్రామంలో సేవా కార్యక్రమాలు ప్రారంభించి.. ఏ లాభం లేకుండా సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. గ్రామ పెద్దల సలహాలు, సూచనలు తీసుకుంటూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఫౌండేషన్లో ఉన్న సభ్యులందరూ తలా కొంత పోగుచేసుకున్న డబ్బులతో స్వచ్ఛందంగా తమ సేవలను కొనసాగిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలను గ్రామస్తులతో పాటు మండల వాసులు అభినందిస్తున్నారు.
కరోనాపై విసృత్తంగా ప్రచారం..
రెండేండ్లుగా కొవిడ్ మహమ్మారీ విజృంభిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చేయూత ఫౌండేషన్ సభ్యులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తూ గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పేద ప్రజలకు లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
చేపడుతున్న కార్యక్రమాలు ఇవీ..