నర్మెట, ఏప్రిల్ 20 : కరోనా నివారణకు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 199 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని వైద్యాధికారి మోజెస్రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా 84 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 10 మందికి పాజిటివ్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు మండలంలో 60 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని 45 సం వత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు.
లింగాలఘనపురంలో..
లింగాలఘనపురం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 68 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 21 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి కరుణాకర్రాజు తెలిపారు. కరోనా బాధితులకు మందులు అందజేసి హోంక్వారంటైన్లో ఉండాలని సూచించినట్లు వివరించారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆయన కోరారు.
బచ్చన్నపేటలో..
బచ్చన్నపేట : మండలంలోని పలు గ్రామాలకు చెందిన 68 మందికి స్థానిక పీహెచ్సీలో కరోనా పరీక్షలు చేయగా, వీరిలో 18 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి కర్రె నవీన్కుమార్ తెలిపారు. మండలంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన కోరారు.
కొడకండ్లలో ..
కొడకండ్ల : కరోనా నివారణకు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 83 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా జీ సీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్ టీకా తీసుకున్నారు. మ రోవైపు 92 మందికి కరోనా పరీక్షలు ని ర్వహించగా, వీరిలో 16 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి డాక్టర్ భాస్కర్ తెలిపారు. 45 ఏళ్లు నిండిన వారు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.
రఘునాథపల్లిలో..
రఘునాథపల్లి : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 112 మందికి కరోనా పరీక్షలు చేయగా 17 మందికి పాజిటివ్ వచ్చింది. మండల వైద్యాధికారి స్రవంతి మాట్లాడుతూ కోమల్ల పీహెచ్సీలో 86 మం దికి పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి మధుకర్యాదవ్ తెలిపారు. కరోనా కే సులు పెరుగుతున్నందుకు ప్రజలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని వారు కోరారు.