కొత్తగూడెం, ఏప్రిల్ 11: ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. అతడు కాటే కల్యాణ్ ఏరియా కమిటీకి చెందిన నక్సలైట్ వెట్టి ఉంగాగా భావిస్తున్నారు. అతడిపై రూ.లక్ష రివార్డు ఉన్నది. జిల్లా రిజర్వు గార్డు (డీఆర్జీ) బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తుండగా గాడం, జంగంపాల్ గ్రామాల మధ్య అడవిలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఎదురుకాల్పుల్లో మరికొందరు నక్సలైట్లు కూడా చనిపోయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. నెమేడ్ పోలీస్స్టేషన్ పరిధిలోని మింగాచెల్ వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ వద్దకు వచ్చిన మావోయిస్టులు ఐదు వాహనాలకు నిప్పు పెట్టారు.