కేసీఆర్ను కలిసిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు
పల్లా గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం
పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేడుక చేసుకున్న నాయకులు
పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
హన్మకొండ/వరంగల్, మార్చి 21 : ‘పల్లా’ గెలుపుపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. శనివారం రాత్రి నుంచే టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. ఆదివారం అన్ని జిల్లాల్లో పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. గెలుపు కోసం సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై నమ్మకంతో పట్టభద్రులు పల్లా రాజేశ్వర్రెడ్డి, సురభి వాణీదేవికి పట్టం కట్టినందుకు సంతోషం వ్యక్తం చేశారు. హన్మకొండలోని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నివాసంలో వివిధ సంఘాలతో కృతజ్ఞతా సమావేశం ఏర్పాటుచేయగా, పల్లా గెలుపులో భాగస్వాములైన అందరికీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని నాయకులతో కలిసి క్యాంపు ఆఫీస్ నుంచి ర్యాలీ తీసి స్వీట్లు పంచారు. అలాగే జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొని పటాకులు కాల్చారు. ములుగులో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ తీసి పటాకులు
పల్లా గెలుపుపై సీఎం అభినందన
ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికలో పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపుకోసం కృషి చేసినందుకు జిల్లా నేతలను సీఎం అభినందించారు. సీఎంను కలిసిన వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎంపీ దయాకర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, జడ్పీ చైర్మన్లు సుధీర్కుమార్, సంపత్రెడ్డి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, రాజయ్య, పెద్ది సుదర్శన్రెడ్డి, శంకర్నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిడ్డి, నన్నపునేని నరేందర్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్రావు, సాంబారి సమ్మారావు, జన్ను జకార్య, లింగాలఘనపురం జడ్పీటీసీ వంశీధర్రెడ్డి, వరంగల్ ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్ సదానందం ఉన్నారు.