ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యం
తొలి ప్రాధాన్యతతో పాటు ఎలిమినేషన్ రౌండ్స్లోనూ ముందంజ
రెండు, మూడు స్థానాల్లో మల్లన్న, కోదండరాం
సుదీర్ఘంగా కొనసాగుతున్న లెక్కింపు ప్రక్రియ
62 మంది స్వతంత్రుల ఓట్లు కేవలం 5966 మాత్రమే
మొత్తం చెల్లని ఓట్లు 21,636
నేటి సాయంత్రానికి తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం
నల్లగొండ ప్రతినిధి, మార్చి19 (నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా కొనసాగుతుండగా, టీఆర్ఎస్ అభ్యర్థి ప ల్లా రాజేశ్వర్రెడ్డి విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యతతో 27,550 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆ తర్వాత మొదలైన ఎలిమినేషన్ రౌండ్స్లోనూ అప్పటికే ఉన్న తొలి ప్రాధాన్యతా ఓట్లకు మరిన్ని ఓట్లు వచ్చి కలుస్తున్నాయి. తొలి, ఎలిమినేషన్ రౌండ్స్ ఓట్లతో కలుపుకొని పల్లా 11,1190 ఓట్లతో ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. 55 మంది ఎలిమినేషన్ తర్వాత స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న 83,629 ఓట్లతో రెండో స్థానంలో, కోదండరాం 70,472 ఓట్లతో తృతీయ స్థానంలో ఉన్నారు. ఎలిమినేషన్ ప్రక్రియ కూడా సుదీర్ఘ సమయం తీసుకుంటున్నది. గురువారం ఉదయం 4గంటలకు మొదలైన ఎలిమినేషన్ ప్రక్రియ నేటి రాత్రి వరకు సాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పటికీ గెలుపు కోటా ఎవ్వరికీ రాకుంటే చివరి ఇద్దరిలో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఇక ఇవి పట్టభద్రులు మాత్ర మే ఓటు వేసే ఎన్నికలే అయినా చెల్లని ఓట్లు మరోసారిగా భారీగానే ఉండడం గమనార్హం.
సుదీర్ఘంగా ఎలిమినేషన్ రౌండ్స్..
నల్లగొండ పట్టణంలోని స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో బుధవారం ఉదయం 8గంటలకు మొదలైన ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగుతున్నది. ఎలిమినేషన్ రౌండ్స్ కూడా ఎక్కువ సమయాన్నే తీసుకుంటున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున బరిలో ఉన్న అభ్యర్థులందరికీ ముందుగా దీనిపై అవగాహన కల్పించారు. ఆ త ర్వాత గెలుపు కోటా కోసం ఎలిమినేషన్ రౌండ్స్ ను ప్రారంభించారు. బరిలో ఉన్న మొత్తం 71 మందిలో తక్కువ ఓట్లు కలిగిన వారిని ఒక్కొక్కరిని తొలగించుకుంటూ వారికి వచ్చిన ద్వితీయ తర్వాత ప్రాధాన్యతా ఓట్లను మిగిలిన అభ్యర్థులకు పంచుతూ వస్తున్నారు. శుక్రవారం రాత్రి పది గంటల వరకు 60 మంది అభ్యర్థుల వరకు ఎలిమినేట్ అయ్యారు. చివరి నుంచి 62 మంది అభ్యర్థులకు వచ్చిన తొలి ప్రాధాన్యతా ఓట్లు కేవలం 5,966 ఓట్లు మాత్రమే కావడం గమనా ర్హం. అయినా వీరందరినీ ఎలిమినేట్ చేస్తూ లె క్కింపు కొనసాగించేందుకు 18గంటల సమ యం తీసుకుంది. వీరి తర్వాత కూడా మిగిలిన ప్రధాన అభ్యర్థుల ఎలిమినేష న్ కార్యక్రమం కొనసాగుతున్నది.
ఇక్కడ అభ్యర్థులకు వే లల్లో ఓట్లు ఉండడంతో ఎక్కు వ సమయం తీసుకోనుంది. ఇవ్వాళ సాయంత్రం తర్వాతే తుది ఫలితం రావచ్చని తెలుస్తున్నది. శుక్రవారం సాయం త్రం 6గంటలకు రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటి ల్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా కనీసం 24గంటల స మయం తర్వాతే విజేత ఖరా రు కావచ్చని స్పష్టం చేశారు. ఇదే జరిగితే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కనీసం 40గంటల సమయం పట్టనుంది. మొత్తంగా చూ స్తే కౌంటింగ్ ప్రక్రియ 80గంటలకు పైగానే సాగుతున్నట్లు చెప్పవచ్చు. ఎలిమినేషన్ రౌండ్స్లో చివరి ముగ్గురు అభ్యర్థులు మిగిలినప్పుడు ఇం దులోనూ తక్కువ ఓట్లతో ఉన్న మూడో అభ్యర్థి ఎలిమినేట్ అవుతాడు. ఇది ఎవరనేది చివరలో తేలనుంది. చివరి ఇద్దరిలో అత్యధిక ఓట్లు కలిగి న అభ్యర్థి విజేత నిలుస్తారు. మొత్తం 3,87,969 ఓట్లకు గానూ 21,636ఓట్లు చెల్లనివిగా నిర్ధారణ కావ డం గమనార్హం. ఇప్పటివరకు ఎలిమినేట్ అయి న అభ్యర్థులు సాధించిన ఓట్ల కంటే ఇవే ఎక్కువ ఉన్నాయి.