పేదలు, దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. సాటి మనిషి కష్టం, బాధ అర్థం చేసుకొని తీర్చగలిగినప్పుడే మానవ జన్మకు అర్థం, పరమార్థం ఉంటాయని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. వారి ముఖాల్లో చిరునవ్వు ఉంటేనే ప్రభుత్వంగా మాకు ఆత్మ సంతృప్తి ఉంటుంది. –మంత్రి కేటీఆర్
దివ్యాంగుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగంలో ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. వికలాంగులకు రూ.3,016 పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దివ్యాంగులకు అవసరమైన వీల్చైర్లు, చేతికర్రలు, త్రీవీలర్ స్కూటీలతోపాటు, కృత్రిమ కాళ్లు, చేతులు తయారుచేసే యూనిట్తో హైదరాబాద్లో అతిపెద్ద పార్క్ను నెలకొల్పనున్నట్టు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా దీని ఏర్పాటుకు కృషిచేస్తామని చెప్పారు. వికలాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.