హైదరాబాద్: మూడు, ఐదేండ్ల న్యాయ కోర్సులతో పాటు, ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ లాసెట్, పీజీ ఎల్సెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నారు. లాసెట్ పరీఓలను ఆగస్టు 23, 24 తేదీల్లో నిర్వహించారు.
మూడేండ్ల లా కోర్సుకు భారీగా దరఖాస్తులు రావడంతో రెండు సెషన్లల్లో పరీక్షలను నిర్వహించారు. దీంతో అధికారులు నార్మలైజేషన్ చేశారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఆలస్యమయ్యాయని అధికారులు. ఫలితాలు https://lawcet.tsche.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.