న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ చివరిదైన నాలుగో సెషన్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. నాలుగో విడుత పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆన్లైన్ పరీక్షలు ఈనెల 26, 27, 31 తేదీల్లో, వచ్చేనెల 1, 2 తేదీల్లో జరుగనున్నాయి. మొత్తం 7 లక్షలకుపైగా విద్యార్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఎన్ఐటీలు, ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ను ఈ ఏడాది నుంచి నాలుగు విడుతల్లో జరపాలని విద్యా శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. మొదటి రెండు సెషన్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో పూర్తయ్యాయి. కరోనా నేపథ్యంలో మె నెలలో జరగాల్సిన చివరి సెషన్ వాయిదా పడింది. ఈ పరీక్ష పూర్తయిన తర్వాతే జేఈఈ మెయిన్ ఫలితాలను విడుదల చేస్తారు. అనంతరం అక్టోబర్ 3న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తారు.
వెబ్సైట్: jeemain.nta.nic.in