హైదరాబాద్: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రాష్ట్రంలో మొత్తం 234 స్థానాలు ఉండగా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 57 సీట్లలో దూసుకుపోతున్నది. అధికార ఏఐఏడీఎంకే 36 స్థానాల్లో ముందంజలో ఉన్నది. కాగా, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ కొలత్తూర్ నియోజకవర్గంలో లీడ్లో ఉండగా, ఆయన కుమారుడు ఉదయ్ నిధి స్టాలిన్.. చెపక్ స్థానంలో వెనకబడిపోయారు. ఎడప్పాడిలో నియోజకవర్గంలో సీఎం పళనిస్వామి ముందజలో కొనసాగుతుండగా, బోడినాయక్కన్నూర్ పోటీచేసిన ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రత్యర్థులకంటే వెనకపడిపోయారు. దక్షిణ కోయంబత్తూర్లో కమలాసన్ వెనకంజలో ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..