రాష్ర్టాన్ని సాధించి బంగారు తెలంగాణ సాధనాక్రమంలో అడుగులు వేస్తున్న కేసీఆర్ను ఉద్యమకాలంలోనూ, పరిపా లనా కాలంలోను అడుగడుగునా గమనిస్తూ ఆయన ఆలోచనలను, కార్యాచరణను ఆవిష్క రించడంలో, ‘ఒక్కగానొక్కడు’ రచన ద్వారా జూలూరు గౌరీ శంకర్ సఫలీకృతుడయ్యారు. 10 అధ్యాయాలలో 69 వ్యాసాలను ఈ సంకల నంలో పొందుపరిచారు. చివరగా 70 పేజీల అనుబంధాన్ని జోడించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పాఠకులకు చేరవేశారు. కొన్ని అధ్యాయాల్లోని వ్యాసాలు కేసీఆర్ ఆలోచనలకు అద్దంపట్టేవిగా ఉన్నాయి.
ఒక ఊరిలోని జనాభాకన్నా ఆ ఊళ్ళో ఫెయిలైన బోరు బావుల సంఖ్య ఎక్కువగా ఉందంటే తెలంగాణది ఎంత దైన్యస్థితి? కేసీఆర్ అపర భగీరథుడిగా అవతారమెత్తడంతో తెలంగాణ ముఖచిత్రమే మారిపోయింది. వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ మాట ల్లో ‘తెలంగాణ దేశానికి మోడల్’గా మారింది. గోదావరి జలాలకు కొత్త నడక నేర్పినవాడు కేసీఆర్. ఇంటింటికీ నల్లా నీళ్ళు, 24 గంటలు నిరంతర విద్యుత్తు, కోటిమందికి కంటి పరీక్షలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు గురుకులాలు మొదలైన పథకాలు ఆయా వర్గాల అభ్యున్నతికి దోహదపడ్తున్నాయి. అరవయ్యేళ్ళ వైఫల్యాలను ఆరేళ్ళ కాలంలో సవరించిన మహానేత కేసీఆర్. రాష్ర్టం సంక్షేమానికి చిరు నామాగా మారిందని, సబ్బండవర్ణాల జీవితాల్లో కాంతులు విరబూ స్తున్నాయని తన వ్యాసాల్లో జూలూరు నిరూపించారు.
11వ్యాసాలతో కూడిన ‘బహుజనవాదం’ అధ్యాయంలో బహు జనుల బాగుకోసం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. బీసీ కమిషన్ను కేసీఆర్ ఏర్పాటు చేయడంతో గుర్తింపుకు నోచుకోని సంచా రజాతులు ‘బీసీ’లుగా గుర్తింపు పొందుతూ విద్య ఉద్యోగాల్లో మొదటిసారిగా రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నారు.
ఏడేండ్ల కాలంలో 60 ఏళ్ల దురన్యాయానికి సమాధి కట్టి, బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ పాత్ర అనితరసాధ్యం. అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ, దేశానికే ఆదర్శప్రాయంగా నిలబెట్టిన సీఎం కేసీఆర్ నిజంగానే ‘ఒక్కగానొక్కడు’.