వ్యక్తులు రాజకీయాల్లో వస్తుంటారు, పోతుంటా రు. అందివచ్చిన అవకాశాలనుపుష్కలంగా వినియోగించుకుంటారు. అలా టీఆర్ఎస్ పార్టీని ఉపయోగించుకున్న వాడు ఈటల. విలువలతో కూడిన రాజకీయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ నిర్ణయాలుంటాయి. పార్టీకి నష్టం చేసే ఎవరి నీ ఆయన ఉపేక్షించరు. ఆ నేపథ్యంలోనే పార్టీకి ఈటల వెన్నుపోటు పొడువటంతో వేటుకు గురయ్యాడు.
ఆత్మగౌరవం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. వ్యక్తి పదవి పోతే ఆత్మగౌరవం లేన్నట్లు కాదు. సమాజంలోని ప్రజలందరికి అవకాశాలు కల్పించి వారిని ఉన్నత స్థితికి చేర్చేలా కృషి చేయటం ఆత్మగౌరవం. నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవం తెలంగాణ రాష్ట్రం. రాష్ట్రం కోసం చావు చివరిదాకా వెళ్లి కేసీఆర్ సబ్బండ వర్గాలను ఏకం చేసి రాష్ట్ర కలను సాకారం చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని పరిరక్షించారు. ఏడేండ్ల స్వయం పాలనలో రాష్ట్రంలో అనేక వినూత్న సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మరింతగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ నిలుపుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకోవటం విడ్డూ రం. ఆత్మగౌరవం పేరుతో రాజీనామా చేసిన ఈటల ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టి వారి అండదండలు పొంద టం పెద్ద వంచన. నిజంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే అయితే బీజేపీలో ఎందుకు చేరినట్లు? స్వతంత్రంగా పోటీ చేస్తే ఆత్మగౌరవం దక్కేదేమో కానీ నేడు అది వంచనకు గురైంది.
తాను ఒక ఎకరం భూమి అమ్మితే ఎన్నికలలో గెలవచ్చు అనే మాటలు ఈటల మాట్లాడటం గర్హనీ యం. ఎన్నికలేవైనా తెలంగాణలో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ను ప్రజలు సంపూర్ణంగా ఆశీర్వదిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి నిరుపేద యువనాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్కు ప్రజలు తమ ఆశీస్సులు అందజేస్తారనటంలో సందేహం లేదు.
ఢిల్లీ పెద్దల అండదండలతో ‘దళిత బంధు’ను అమ లు కాకుండా కుట్ర చేయటం ద్వారా హుజూరాబాద్ ప్రజలకు తీరని ద్రోహం చేశాడు ఈటల. ఇటువంటి వాడు తననే గెలిపించాలని ప్రజలను ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు? ఢిల్లీ ఆశీస్సులుంటే చాల నీ, ప్రజల ఆశీస్సులు అవసరం లేదనే భావనలో ఈటల తీరు కనిపిస్తున్నది. కానీ తెలంగాణ కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడిన విద్యార్థి నేతకు ప్రజలు అవకాశం ఇచ్చి ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది.
అధికారం కోసం పాకులాడే పార్టీలు ఒకవైపు, తెలంగాణను బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్ది సబ్బండ వర్గాల ఆర్థిక స్థితి గతులను పెంచటానికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ మరోవైపు ఉన్నాయి. ప్రజలు దూరదృష్టితో ఆలోచించి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పక్షాన నిలబడి ఉద్యమ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఢిల్లీని ఈటల నమ్ముకుంటే, టీఆర్ఎస్ అభ్యర్థి హుజూరాబాద్ గల్లీ ప్రజలనే నమ్ముకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హుజూరాబాద్ ప్రజలు తమ బిడ్డ అయిన గెల్లు శ్రీనివాస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలి. యువ శక్తికి పట్టం గట్టాలి. తెలంగాణ వ్యతిరేకులకు బుద్ధిచెప్పాలి.
(వ్యాసకర్త: టీఆర్ఎస్వీ నాయకుడు, మాస్టర్ ఆఫ్ సోషల్వర్క్ విద్యార్థి)
సంపత్ గడ్డం
7893303516