నేనెప్పుడూ జై తెలంగాణ అన్న కానీ.. జై కేసీఆర్ అని అనలే. కానీ ఇవ్వాళ ఆర్బీఐ డేటాను చూసిన తర్వాత జై కేసీఆర్ అని సంతోషంగా అంటా.
భారతదేశ జీడీపీకి అత్యధికంగా దోహదం చేసే రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగోదని ‘న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్’ పత్రికలో వచ్చిన వార్త చూసి చాలా సంతోషం అనిపించింది.. గర్వమనిపించింది కూడా. రిజర్వ్బ్యాంక్ అఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన సమాచారం ఆధారంగా ఈ వార్తను రాశారు. ఆర్బీఐ ప్రచురించిన డేటాని కొంచెం లోతుగా పరిశీలిస్తే ఎన్నో మంచి అంశాలు కనపడుతాయి. దీనిని విశదీకరించే చిన్న ప్రయత్నమే ఇది..
రాష్ట్ర ఆర్థికవృద్ధికి/జీఎస్డీపీకి Net State Value Added అనేది ఒక కొలమానం. రాష్ట్ర జీఎస్డీపీకి మనం ఇచ్చే సబ్సిడీలు కలిపి అందులోనించి ఇన్డైరెక్ట్ టాక్సెస్ (జీఎస్టీ) మైనస్ చేస్తే వచ్చేదే Net State Value Added (NSVA). గత నాలుగేండ్లలో తెలంగాణ NSVA/ GSDP 50 శాతం పెరిగింది. అంటే సగటున ప్రతి సంవత్సరం 10.7 శాతం పెరిగిందన్న మాట. ఇది ఆషామాషీ విషయం కాదు. ఎందుకంటే గత 18 నెలలుగా ప్రపంచమంతా కొవిడ్ మహమ్మారితో అల్లకల్లోలం అవుతున్న విషయం తెలిసిందే. ఇటువంటి విపత్తును ఎదుర్కొంటూ కూడా తెలంగాణ ఈ స్థాయిలో పెరుగుదలను నమోదు చేసింది.
కేవలం ఏడేండ్ల వయసున్న కొత్త రాష్ట్రం తెలంగాణ. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ర్టాలతో తెలంగాణ సరితూగి నిలబడుతున్నదంటే రాష్ర్టాన్ని నడుపుతున్న, నడిపిస్తున్న ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాలి. అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే.. తలసరి ఆదాయంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలబడడం. దాని అర్థం ఏందంటే తెలంగాణ ఆర్థికంగా ఉత్పాదక రాష్ట్రమని, ఇక్కడి ప్రజలు పనిమంతులని.
ముగింపు: 1. నేనెప్పుడూ జై తెలంగాణ అన్న కానీ.. జై కేసీఆర్ అని అనలే. కానీ ఇవ్వాళ ఆర్బీఐ డేటాని చూసిన తరువాత జై కేసీఆర్ అని సంతోషంగా అంటా. It is a great achievement to put the states economic standing on a firm footing.
విశ్వేశ్వర్ మంగళపల్లి