‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ నినాదం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, భారత్ను ప్రపంచానికే తయారీ కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా కనబడుతున్నాయి. భారత్లో తమ వాహనాల తయారీని నిలిపివేస్తున్నామని అమెరికాకు చెందిన వాహన తయారీ కంపెనీ ఫోర్డ్ ఇటీవల ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల ఆ సంస్థకు చెందిన రెండు ప్లాంట్లలోని 4 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఈ కంపెనీకి విడిభాగా లను సరఫరా చేసే సంస్థలకు కూడా ఇది తీవ్రమైన దెబ్బ. ‘భారత్లో తయారీ’ పథకం ఆశించిన ఫలితం ఇవ్వడం లేదనడానికి ఇది తాజా నిదర్శనం.
ఇటీవలి కాలంలో విదేశీ కంపెనీలు తమ ప్లాంట్లను మూసివేసి, పెట్టా బేడా సర్దుకొని వెళ్లిపోతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ అమెరికన్ కంపెనీ హార్లీ డేవిడ్సన్ కూడా గతే డాది భారత్లో బైక్ల తయారీని నిలిపివేసింది. మోటార్సైకిళ్ల పరంగా భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. హార్లీ డేవిడ్సన్ వంటి కంపెనీ ఇంతపెద్ద మార్కెట్ను వదులుకొని వెళ్లిపోవడం ఆశ్చర్యకరమే. భారత్లో తమ కార్యకలాపాలను ఇకపై విస్తరించబోమని టయోటా కంపెనీ నిరుడు ప్రక టించింది. అంతకంటే ముందు 2017లో మరో ప్రఖ్యాత వాహన తయారీ కంపెనీ జనరల్ మోటార్స్ కూడా భారత్లో కార్ల తయారీ ని నిలిపివేస్తున్నామని తెలిపింది. ఇలా పలు దిగ్గజ కంపెనీలు దేశం విడిచి వెళ్లటం లేదా తయారీ కార్యకలాపాలను నిలిపివేయటంతో మోదీ ప్రకటించిన ‘భారత్లో తయారీ’ పథకం ప్రశ్నార్థకం అవుతున్నది.
ఏదైనా కంపెనీ నిలువలేకపోవడానికి దాని యాజమాన్య, వ్యాపా ర వైఫల్యాలు కూడా కారణం కావచ్చు. కానీ మన దేశ విధానాలు ఏ మేరకు ప్రోత్సాహకరంగా ఉన్నాయనేది కూడా చర్చనీయాంశం. హార్లీ డేవిడ్సన్ బైక్ల మీద భారత్ వేస్తున్న సుంకాలపై అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. భారత్ను ఆయన ‘టారిఫ్ కింగ్’ అని అభివర్ణించడం గమనార్హం. వాస్తవానికి అంతర్జాతీయ పరిస్థితులు భారత్కు అనుకూలంగా ఉన్నా యి. అమెరికా తెస్తున్న ఒత్తిడితో చైనాలోని పలు విదేశీ కంపెనీలు ఆసియాలోని ఇతర దేశాలకు వలసపోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ దశలో వియత్నాం స్థాయిలో కూడా మనదేశం విదేశీ కంపెనీల ను ఆకర్షించలేకపోతున్నదనే అభిప్రాయం వ్యాపారవర్గాల్లో ఉన్నది. విదేశీ కంపెనీల సంగతి ఎలా ఉన్నా, రాహుల్ బజాజ్ వంటి దేశం లోని లబ్ధప్రతిష్ఠులైన వ్యాపారవేత్తలే ప్రభుత్వ విధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రిత వ్యాపారవర్గాన్ని ప్రోత్సహించ డమే తప్ప మొత్తం వ్యాపార అనుకూల వాతావరణాన్ని నెలకొల్పడం లేదనే విమర్శ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. మొత్తం ఆసియా మార్కెట్లకే మన దేశాన్ని కేంద్రంగా చేసుకోవాలనుకునే వ్యాపార సంస్థలకు ప్రోత్సా హాన్ని ఇవ్వాలి.