బ్రిటిష్ దాస్య శృంఖలాలను బద్దలు కొట్టుకొని మన దేశం స్వేచ్ఛావాయువులను పీల్చిన పంద్రాగస్టుకు 75 ఏండ్లు. ఈ జాతీయ మహోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం వజ్రోత్సవాల పేరిట రెండు వారాల పాటు దేశభక్తి ప్రబోధక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో మన జాతీయోద్యమాన్ని, నాటి భారతీయుల త్యాగాలను,నేతల నాయకత్వ పటిమను, స్వాతంత్య్ర ఫలాలను అంశంగా తీసుకొని కవితలు రాయవలసిందిగా కవులకు ‘నమస్తే తెలంగాణ’ పిలుపునిస్తున్నది.
ఈ కవితలను రేపటి సాహితీ సంచిక ‘చెలిమె’లో ప్రచురిస్తాం.
కవితలను editpage@ntnews.com మెయిల్ చేయగలరు.